ETV Bharat / bharat

దుబే ఎన్​కౌంటర్​ స్పాట్​లో 'సెల్ఫీ' మోత

author img

By

Published : Jul 11, 2020, 8:25 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబేను ఎన్​కౌంటర్​ చేసిన ప్రదేశం సంచలనంగా మారింది. ఘటనాస్థలాన్ని చూడటానికి ప్రజలు భారీగా తరలివెళ్లారు. బోల్తా పడ్డ కారు, రక్తపు మరకలను తమ కెమెరాల్లో బంధించారు. చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు. 8మంది పోలీసులను హత్య చేసిన గ్యాంగ్​స్టర్​ దుబే.. శుక్రవారం కాన్పుర్​ శివార్లలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించాడు.

Crowds gather around encounter spot, some take selfies
దూబే ఎన్​కౌంటర్​ స్పాట్​లో 'సెల్ఫీ' మోత

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే ఎన్​కౌంటర్​ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే అతడిని ఎన్​కౌంటర్​ చేసిన ప్రదేశం కూడా సంచలనంగా మారింది. దుబే మరణ వార్త విన్న అనంతరం స్థానిక ప్రజలు ఘటనాస్థలానికి భారీగా తరలివెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎగబడ్డారు.

8మంది పోలీసులను హత్య చేసిన గ్యాంగ్​స్టర్​ దుబేను గురువారం మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం ఉత్తరప్రదేశ్​లోని కాన్పుర్​ శివార్లలో జరిగిన ఎన్​కౌంటర్​లో దుబే హతమయ్యాడు. తమ వద్ద నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోతుండగా.. ఆత్మరక్షణ కోసం అతడిని ఎన్​కౌంటర్​ చేశారు పోలీసులు.

Crowds gather around encounter spot, some take selfies
ఘటనాస్థలం

అయితే ఘటనాస్థలంలో బోల్తా పడి ఉన్న వాహనాన్ని తొలగించడానికి ఆలస్యమైంది. ఈ సమయంలో దానిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. అటువైపుగా వెళ్తున్న వాహనాలు కూడా ఆగి చూడటం మొదలుపెట్టాయి. దీని వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ఆ తర్వాత వాహనాన్ని తొలగించినా.. రక్తపు మరకలు అలాగే ఉండిపోయాయి. కొంతమేర నీలిరంగులోకి మారాయి. వర్షం, ఫోరెన్సిక్​ పరీక్ష వల్ల ఇలా జరిగినట్టు భావిస్తున్నారు. ఆ రక్తపు మరకలను కూడా ఆసక్తిగా తిలకించారు ప్రజలు. అంతేకాకుండా ఘటనాస్థలంలో సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

ఇవీ చూడండి:-

గ్యాంగ్​స్టర్​ వికాస్​ దుబే ఎన్​కౌంటర్​ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే అతడిని ఎన్​కౌంటర్​ చేసిన ప్రదేశం కూడా సంచలనంగా మారింది. దుబే మరణ వార్త విన్న అనంతరం స్థానిక ప్రజలు ఘటనాస్థలానికి భారీగా తరలివెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎగబడ్డారు.

8మంది పోలీసులను హత్య చేసిన గ్యాంగ్​స్టర్​ దుబేను గురువారం మధ్యప్రదేశ్​ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం ఉత్తరప్రదేశ్​లోని కాన్పుర్​ శివార్లలో జరిగిన ఎన్​కౌంటర్​లో దుబే హతమయ్యాడు. తమ వద్ద నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోతుండగా.. ఆత్మరక్షణ కోసం అతడిని ఎన్​కౌంటర్​ చేశారు పోలీసులు.

Crowds gather around encounter spot, some take selfies
ఘటనాస్థలం

అయితే ఘటనాస్థలంలో బోల్తా పడి ఉన్న వాహనాన్ని తొలగించడానికి ఆలస్యమైంది. ఈ సమయంలో దానిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. అటువైపుగా వెళ్తున్న వాహనాలు కూడా ఆగి చూడటం మొదలుపెట్టాయి. దీని వల్ల ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది.

ఆ తర్వాత వాహనాన్ని తొలగించినా.. రక్తపు మరకలు అలాగే ఉండిపోయాయి. కొంతమేర నీలిరంగులోకి మారాయి. వర్షం, ఫోరెన్సిక్​ పరీక్ష వల్ల ఇలా జరిగినట్టు భావిస్తున్నారు. ఆ రక్తపు మరకలను కూడా ఆసక్తిగా తిలకించారు ప్రజలు. అంతేకాకుండా ఘటనాస్థలంలో సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.